తిరుమల దాదాపు అందరు సినీ తారలకి ఇష్టమైన కేంద్రంగా మారుతోంది. నిజానికి ఇది కొత్త విషయం కాదు కానీ ఈ రోజుల్లో ట్రాఫిక్ భారీగా ఉంది. తిరుమలతో చిత్ర ప్రముఖులు సంబంధం అనేక దశాబ్దాల నుండి ఉంది.

నాగార్జున కొన్ని రోజులు క్రితం తిరుమలకు వచ్చారుతరువాత
'హ్యాపీ డేస్' ఫేమ్ సోనియా దర్శనం చేసుకుని వెళ్ళింది. మోహన్ బాబు USA నుండి తిరిగి వచ్చిన తరువాత తన కొత్త కవల మనవరాళ్ళ  కోసం వేంకటేశ్వర స్వామి దీవెనల కోసం దర్శనo చేసుకున్నారు. నటుడు చిరంజీవి (రాజకీయ నాయకుడు అనాలేమో మరి) కూడా దర్శనం చేసుకున్నారు.  
 నిర్మాత దిల్ రాజు 'ఓ మై ఫ్రెండ్' విడుదలైన తర్వాత కొన్ని వారాల క్రితం దర్శనం చేసుకున్నారు.  దర్శకుడు మధుర శ్రీధర్ కూడా 'ఇట్స్ మై లవ్ స్టోరీ' 50 రోజుల రన్ తర్వాత దర్శనం చేసుకున్నారు.
ఇటీవలే హీరోయిన్ కాజల్ కూడా తన కొత్త చిత్రం 'Businessman' విజయం సాధించాలి అని తిరుమల దర్శనం చేసుకుంది. ఆమెతో పాటు తన చెల్లి నిషా అగర్వాల్ (సోలో ఫేం) కూడా వచ్చింది. మొత్తం మీద, తిరుమల ప్రముఖుల దర్శనాలతో బిజీగా ఉంది.